Thursday, March 24, 2011

అంతర్‌జ్ఙానము

మానవ మేధస్సు ఎంత వరకు అందుకోగలదో చూసేక దాని కతీతమైన శక్తి ఉన్నదని గ్రహిస్తాము.ఒక స్థితి చేరేకమేధస్సు మనకిక దారి చూపలేదు. అంతర్‌జ్ఙానమే మనలకిక దారి చూప గలదు.బుద్ధి పరీక్షిస్తుంది, లెక్కలేస్తుంది, నిర్ణయిస్తుంది,అంగీకరిస్తుంది (మరియు) మనసు లోపలజరిగే దానినంతటినీ నిరాకరిస్తుంది. కాని అంతర్‌జ్ఙానము లోతైన అంతరాళాలలో దాని మూలము నుండి, దానంతటాదే ప్రారంభమయే ఎటువంటి అవరోధాలు లేనిఒక ధార. ఎప్పుడైతే మనసు శాంతమైన, సమానత్వమైన, నిర్వికారమైన స్థితికిచేరుతుందో  అప్పుడే ఇది ప్రారంభమవుతుంది. వ్యక్తి అన్నింటినీతేట తెల్లంగా చూడడం పొరారంభించేటట్లుగా ఆ పవిత్రమైన అంతర్‌జ్ఙానము మానవ చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది. అజ్ఙానము తొలగి, సంపూర్ణమైన జీవితం తెలుసుకొనబడుతుంది. అనేక అనుభవాల పిమ్మట స్వానుభవము మార్గదర్శీయి ఎటువంటి ప్రయత్నము లేకుండ వ్యక్తి అంతర్‌జ్ఙానాన్ని పొందడం ప్రారంభిస్తాడు.

No comments: