Monday, December 29, 2014

కురుక్షేత్ర మహా యుద్ధం




కురుక్షేత్ర యుద్దంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొందని చదివాము కదా.. మరి అక్షౌహిణి అంటే మన లెక్కలో ఎంత అన్నది ఒకసారి చూద్దామా...
ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5గురు సైనికులు (కాలి బంట్లు) కలిపి పత్తి అంటారు.
3 x పత్తి = సేనాముఖం
3 x సేనాముఖం = గుల్మం
3 x గుల్మం = గణం
3 x గణం = వాహిని
3 x వాహిని = పృతన
3 x పృతన = చమువు
3 x చమువు = అనీకిని
10 x అనీకిని = అక్షౌహిణి

మరి లెక్క పూర్తి చేసి చూద్దామా ?
1 అక్షౌహిణి =
21870 రథాలు
21870 ఏనుగులు
65610 గుర్రాలు
109350 సైనికులు

ఈ మొత్తం 1 అక్షౌహిణి. కాని కురుక్షేత్ర యుద్దంలో 18 అక్షౌహిణిలు పాల్గొన్నాయి. కాబట్టి 18తో హెచ్చవేయండి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి... :)
-తెలుగు వెలుగు నుంచి..
http://ramojifoundation.org/flipbook/201410/magazine.html#/10

No comments: